ఉపాధి హామీ కూలీలకు ఉపయోగపడేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధి హామీ కూలీలకు రూ.2 లక్షల వరకూ జీవిత బీమా కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏపీ పంచాయతీరాజ్ శాఖ అధికారుల మధ్య ఒప్పందం కుదిరింది. ఏపీ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. మేడే ఉత్సవాల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్.. ఉపాధి హామీ కూలీలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీలను ఇకపై ఉపాధి శ్రామికులుగా పిలవాలని విజ్ఞప్తి చేశారు.