ఏపీలో వారందరికీ రూ. లక్ష.. చంద్రబాబు కీలక ప్రకటన..

9 months ago 32
ఏపీలోని ముస్లిం సామాజికవర్గానికి సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ వినిపించారు. హజ్ యాత్రికులకు ప్రభుత్వం తరుఫున రూ. లక్ష సాయం చేస్తామని ప్రకటించారు. కడప, విజయవాడలో హజ్ భవనాలను నిర్మిస్తామని చంద్రబాబు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. మైనారిటీ సంక్షేమ దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన..ఈ విషయాలను వెల్లడించారు. ఇక ముస్లిం మైనారిటీ వర్గాల అభివృద్ధికి టీడీపీ మొదటి నుంచి అండగా ఉంటోందని చంద్రబాబు గుర్తు చేశారు. ఉర్దూను రెండో అధికారిక భాషగా గుర్తించడంతో పాటుగా మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్, ఉర్దూ అకాడమీ ఏర్పాటు చేసింది టీడీపీ హయాంలోనేనని చంద్రబాబు అన్నారు.
Read Entire Article