ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని చేనేతలకు అండగా నిలిచేందుకు మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. చేనేత కుటుంబాలకు నేతన్న భరోసా పథకం కింద ఏటా రూ.25000 చొప్పున అందించాలని నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు ఇటీవల ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఈ పథకం మార్గదర్శకాలపై చర్చ జరుగుతోంది. తెలంగాణలో నేతన్న అభయ హస్తం కింద నేతన్న భరోసా పథకం అమలు చేయనుంది అక్కడి ప్రభుత్వం. ఇందుకోసం మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఏపీలో కూడా ఇలాంటి తరహా మార్గదర్శకాలే ఉండొచ్చని భావిస్తున్నారు.