Talliki Vandanam Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'తల్లికి వందనం' పథకం కింద నిధులు విడుదల చేసింది. గ్రీవెన్స్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అర్హుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. NPCI సమస్యల వల్ల విఫలమైన చెల్లింపులను కూడా పరిష్కరించారు. తిరుపతి జిల్లాలో కొంతమంది విద్యార్థులకు డబ్బులు అందకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఆధార్ కార్డులలోని తప్పులను సరిచేసి త్వరలోనే ఆ స్కూల్ విద్యార్థుల సమస్యను పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు.