Matsyakara Bharosa Scheme Rs 20 Thousand: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యకార కుటుంబాలకు వేట నిషేధ సమయంలో రూ.20 వేల భృతి అందించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లాలో ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. గత ప్రభుత్వ నిబంధనలను సవరిస్తూ, డీజిల్ రాయితీ వినియోగ నిబంధనను తొలగించారు. ఎన్టీఆర్ పెన్షన్ పథకం లబ్ధిదారులు కాకుండా, ఇతర ప్రభుత్వ పథకాలు పొందుతున్నా భృతికి అర్హులే. ఈ నెల 26న లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు.