ఏపీ మంత్రి నారా లోకేష్ అనంతపురం జిల్లాలో పర్యటించారు. తన పర్యటన సందర్భంగా కళ్యాణదుర్గంలో భక్త కనకదాస విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడిన నారా లోకేష్.. కురబ సామాజికవర్గానికి శుభవార్త చెప్పారు. ఆదరణ 3.0 పథకం కింద కురుబలకు త్వరలోనే ఆధునిక పనిముట్లు అందిస్తామని తెలిపారు. మరోవైపు చేతివృత్తుల వారికి అవసరమైన ఆధునిక పనిముట్లు అందించి.. వారి జీవనోపాధిని మెరుగుపరచటం ద్వారా వారి జీవితాలలో మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం ఆదరణ 3.0 పథకానికి శ్రీకారం చుట్టింది.