Ntr Bharosa Pension Money Into Accounts: ఏపీ ప్రభుత్వం పింఛన్లకు సంబంధించి కొన్ని మార్పులు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగ పింఛను అందుకుంటున్న వారిలో విద్యార్థులు ఉన్నారు.. వీరు ఊరికి దూరంగా ఇతర ప్రాంతాల్లో ఉండి చదువుకుంటున్నారు. వీరు ప్రతినెలా పింఛను తీసుకునేందుకు పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయాలకు సెలవుపెట్టి వ్యయప్రయాసలతో ఊరికి రావాల్సి వస్తోంది. దీంతో ప్రభుత్వం వీరి సమస్యలను దృష్టిలో పెట్టుకుని వారి బ్యాంకు అకౌంట్కే పింఛను డబ్బులు జమ చేసేందుకు నిర్ణయించింది.. ఈ మేరకు దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది.