Rompicherla Father Daughter SSC Results: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాల్లో కాకినాడకు చెందిన ఎల్లా నేహాంజని 600/600 మార్కులు సాధించగా, పల్నాడు జిల్లాకు చెందిన పావనీచంద్రిక ప్రభుత్వ పాఠశాలల నుంచి అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినిగా నిలిచింది. చిత్తూరు జిల్లాలో తండ్రీకూతురు ఒకేసారి టెన్త్ పాసయ్యారు. పార్వతీపురం మన్యం జిల్లాలో కవలలకు సమానంగా 582 మార్కులు రావడం విశేషం. ఫలితాల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఫస్ట్ డివిజన్లో ఉత్తీర్ణత సాధించారు.