Ap Govt Decided Change Anganwadi Menu: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పోషకాహారం అందించేందుకు చర్యలు చేపట్టింది. మూడు నుంచి ఆరేళ్ల పిల్లల మధ్యాహ్న భోజనంలో మార్పులు చేయనున్నారు.. వారానికి రెండు రోజులు ఎగ్ ఫ్రైడ్ రైస్తో పాటు ఉడికించిన శనగలు ఇస్తారు. బాలామృతంలో చక్కెర స్థాయిని తగ్గించి, పోషకాలు పెంచేందుకు కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మార్పులను ముందుగా కొన్ని జోన్లలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసి, ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తారు.