Nara Lokesh Reimbursement Semester Wise: మంత్రి నారా లోకేష్ తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా యూనివర్శిటీలో పర్యటించారు. ఇంజినీరింగ్ కాలేజీలోని బీటెక్ ట్రిపుల్ఈ మూడో సంవత్సర విద్యార్థినులతో మాట్లాడారు. ఈ మేరకు ఫీజ్ రీయింబర్స్మెంట్కు సంబంధించిన అంశంపై కీలక ప్రకటన చేశారు. ఇకపై సెమిస్టర్ వారీగా డబ్బుల్ని విడుదల చేస్తామన్నారు. గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన రూ.4వేల కోట్ల బకాయిల్నికూడా విడతలవారీా చెల్లిస్తామన్నారు. అలాగే విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామన్నారు.