, AP Govt Education Loans 4% Interest Subsidy: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో 5వ బ్లాక్లో 235వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 2026-27 వార్షిక రుణ ప్రణాళికపై చర్చించారు. వ్యవసాయ రంగం, ఎంఎస్ఎంఈ, స్వయం సహాయ సంఘాలు, కౌలు రైతులకు ఇచ్చిన రుణాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యార్థులకు అందించే రుణాలపై వడ్డీ రాయితీని ప్రకటించారు.