హైదరాబాద్ ఐటీ కారిడార్లో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు రూ.1656 కోట్లతో బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి శిల్పా లేఅవుట్ వరకు ప్రతిపాదించిన ప్రతిష్టాత్మక ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు ప్రభుత్వం కొత్తగా మరో రోడ్డును అనుసంధానం చేయనుంది. మెహిదీపట్నంలోని నానల్నగర్ జంక్షన్ నుంచి ఫిలింనగర్ రోడ్డు నంబర్ 82 వరకు రక్షణ శాఖ భూముల అంచు మీదుగా కిలోమీటర్ పొడవైన నూతన రహదారిని హెచ్ఎండీఏ డిజైన్ చేస్తోంది. దీనివల్ల ఔటర్ రింగ్ రోడ్డు, పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్వేల మధ్య ప్రయాణం మరింత సులభతరం కానుంది.