Andhra Pradesh Students Sanna Biyyam Meals: ఏపీలో విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ మేరకు ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో.. మంత్రి నారా లోకేష్ గారు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంతో పాటుగా హాస్టల్స్లో చదివే విద్యార్థులకు ఇకపై సన్న బియ్యం వినియోగాన్ని ప్రతిపాదించారు. ప్రాంతాల వారీగా పిల్లలు ఇష్టపడి తినేలా మెనూలో మార్పులతో పాటుగా సన్న బియ్యంతో భోజనం అందించనున్నారు. ఈ మేరకు మంంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి సన్న బియ్యంపై కీలక ప్రకటన చేశారు.