Andhra Pradesh Govt Fees Reimbursement Released For Students: ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి ప్రభుత్వం భారీ స్థాయిలో నిధులు విడుదల చేసింది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి రూ.600 కోట్లు విడుదల చేసినట్లు విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. త్వరలో మరో రూ.400 కోట్లు విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటికే రూ.788 కోట్లు విడుదల చేశామని తెలిపారు.