ప్రభుత్వం విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. చదువులో వెనుకబడిన విద్యార్థుల కోసం కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత బోధనను ప్రవేశపెట్టనుంది. ఎంపిక చేసిన పాఠశాలల్లో 'పర్సనలైజ్డ్ అడాప్టివ్ లెర్నింగ్' విధానంలో డిజిటల్ విద్యను అందించనున్నారు. విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసి, వారి అవసరాలకు తగ్గట్టుగా పాఠాలు బోధించనున్నారు. ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే మరిన్ని పాఠశాలలకు విస్తరించే ఆలోచనలో ఉన్నారు.