ఏపీ ప్రభుత్వం శనగ రైతులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యా్ప్తంగా బుధవారం నుంచి (ఫిబ్రవరి 18) శనగల కొనుగోళ్లు ప్రారంభించింది. ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ఈ విషయాన్ని వెల్లడించారు. 94500 మెట్రిక్ టన్నుల శనగలను కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. రైతుల నుంచి శనగలు కొనుగోలు చేసిన 15 రోజుల్లోనే వారి బ్యాంక్ ఖాతాలలో డబ్బులు జమ చేస్తామన్నారు. దళారులను ఆశ్రయించి మోసపోవద్దంటూ రైతులకు అచ్చెన్నాయుడు కీలక సూచనలు చేశారు.