సింగపూర్ మోడల్ అధ్యయనం కోసం ఏపీ మంత్రుల బృందం సింగపూర్లో పర్యటిస్తోంది. వారం రోజుల పాటు సింగపూర్లో పర్యటించనున్న ఏపీ మంత్రులు.. ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ శిక్షణా కార్యక్రమానికి హాజరుకానున్నారు. అలాగే పాలనలో, ప్రజా సమస్యల పరిష్కారంలో సింగపూర్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను లోతుగా అధ్యయనం చేయనున్నారు.