ఏపీ ప్రభుత్వం పేదలకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో సొంత ఇల్లు లేని వారికి తీపికబురు వినిపించింది. అలాంటి వారిని గుర్తించి జాబితాను తయారు చేయాలంటూ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. 15 రోజుల్లోగా సర్వే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. గృహ నిర్మాణ శాఖపై సమీక్షించిన చంద్రబాబు.. ప్రస్తుతం చేపడుతున్న గృహ నిర్మాణ ప్రాజెక్టులపై ఆరా తీశారు. వచ్చే నెలలో మూడు లక్షల ఇళ్లల్లో గృహ ప్రవేశాలు చేయించాలని స్పష్టం చేశారు.