Andhra Pradesh Students Sanna Biyyam Mid Day Meal: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగంలో సంస్కరణలు తీసుకొస్తోంది. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ ఇటీవల పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో, కాలేజీల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు ప్రతి రోజూ అందించే మధ్యాహ్న భోజనానికి ఇకనుంచి సన్నబియ్యం వినియోగించాలని నిర్ణయించారు. ఈ మేరకు కేబినెట్ కూడా నిర్ణయం తీసుకుంది.. అయితే దీనిని ఎప్పటి నుంచి అమలు చేస్తారో మంత్రి క్లారిటీ ఇచ్చారు.