Andhra Pradesh Mid Day Meals In Summer Holidays: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరువు ప్రాంత విద్యార్థులకు శుభవార్త తెలిపింది. వేసవి సెలవుల్లో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయనుంది. కేంద్రం నిధులు ఇవ్వకున్నా రాష్ట్ర ప్రభుత్వమే నిధులు వెచ్చిస్తుందని విద్యాశాఖ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. కరువు ప్రాంతాల్లోని విద్యార్థులకు వేసవిలో భోజనం అందించాలని దాఖలైన పిల్ను హైకోర్టు కొట్టివేసింది. ఈ నిర్ణయం కరువు ప్రాంత విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుంది.