Andhra Pradesh School Students 20 Mins Meditation: పిల్లల్లో ఒత్తిడిని తగ్గించేందుకు ఏపీ ప్రభుత్వం సరికొత్త ప్రయత్నం మొదలుపెట్టింది. కోనసీమ జిల్లాలో పాఠశాల విద్యార్థులకు ధ్యానం చేయిస్తున్నారు. దీనివల్ల విద్యార్థుల్లో ఏకాగ్రత పెరగడంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుందని భావిస్తున్నారు. ఉదయం, సాయంత్రం ప్రతిరోజు 10 నిమిషాల పాటు ధ్యానం చేయిస్తారు. ఈ కార్యక్రమం విజయవంతమైతే రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో అమలు చేస్తారు. ఇంతకీ ఈ ధ్యానం ఎలా ఉంటుందో తెలుసా?