Sarvepalli Radhakrishnan Vidyarthi Mitra Scheme: ఏపీలో స్కూల్ విద్యార్థులు, టీచర్లకు సంబంధించి మంత్రి నారా లోకేష్ కీలక ఆదేశాలు జారీ చేశారు. టీచర్లకు ఉన్న 45 యాప్లను ఒకే యాప్గా తీసుకురావాలని సూచించారు. జీవో-117 ఉపసంహరణ తర్వాత టీచర్ల కేటాయింపు అంశాన్ని ప్రస్తావించారు. 'వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు అందేలా చర్యలు తీసుకోవాలి' అని మంత్రి నారా లోకేష్ సూచించారు.