Andhra Pradesh Parents Teachers Meeting On December 7th: ఏపీ ప్రభుత్వం మొత్తానికి టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశానికి ముహూర్తం ఫైనల్ చేసింది. గతంలో రెండు, మూడుసార్లు వాయిదా పడిన ఈ సమావేశాన్ని నిర్వహించేందుకు సిద్ధమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్వయంగా ఈ సమావేశంలో పాల్గొంటారు. వచ్చే నెల 7న బాపట్లలో ఈ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు.. ఈ మేరకు సమావేశానికి సంబంధించి ఏర్పాట్లను ముమ్మరం చేశారు.