ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీని క్రీడా రాజధానిగా మార్చేలా ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలోనే స్పోర్ట్స్ సిటీ, అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ప్రణాళికలు రచిస్తోంది. విజయవాడ ఎంపీ, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని చిన్ని వీటిని ఎక్కడ ఏర్పాటు చేస్తారనే దానిపై కీలక వివరాలు వెల్లడించారు. జర్నలిస్ట్ క్రికెట్ లీగ్ ప్రారంభించిన కేశినేని శివనాథ్.. ఈ సందర్భంగా ఈ విషయాలు వెల్లడించారు. మరోవైపు దేశంలోనే అతిపెద్ద అంతర్జాతీయ స్టేడియం నిర్మించాలనే ఆలోచనలో ఏసీఏ ఉన్న సంగతి తెలిసిందే.