ఏపీలోకి అఘోరి ఎంట్రీ.. వేంపాడు టోల్‌గేట్ వద్ద ఆందోళన.. ఏం జరిగిందంటే?

1 year ago 29
ఇటీవలి కాలంలో తెలంగాణలో హాట్‌టాపిక్‌గా నిలిచిన అఘోరీ.. ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించారు. అనకాపల్లి జిల్లా వేంపాడు టోల్‌గేట్ వద్ద హంగామా సృష్టించారు. విశాఖపట్నం వైపుగా వెళ్తున్న అఘోరీని.. టోల్‌గేట్ సిబ్బంది అడ్డుకున్నట్లు తెలిసింది. అయితే టోల్‌గేట్ సిబ్బంది తనపట్ల అనుచితంగా, దురుసుగా ప్రవర్తించారంటూ అఘోరీ నిరసనకు దిగారు. కారును రోడ్డుపైనే పార్కింగ్ చేసి ఆందోళనకు దిగారు. ఇక అఘోరీ వచ్చిన విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడ గుమికూడటంతో పోలీసులు ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది. పోలీసుల జోక్యంతో చివరకు పరిస్థితి సద్దుమణిగింది.
Read Entire Article