మౌలిక వసతుల నిర్మాణానికి పెద్ద పీట వేస్తున్న ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. పోర్టులను అనుసంధానించే రోడ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. పోర్టులను సమీపంలోని జాతీయ రహదారులతో అనుసంధానించే రాష్ట్ర రహదారులను విస్తరించాలని ప్రభుత్వం భావించినట్లు సమాచారం. ఈ మేరకు ఆరు పోర్టులను నేషనల్ హైవేలతో అనుసంధానించే 15 రహదారులను ఏపీ రోడ్లు భవనాల శాఖ ఎంపిక చేసినట్లు తెలిసింది. సుమారుగా 1100 కోట్లతో అభివృద్ధి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం.