AP government extends contract lab technicians service: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పశుసంవర్ధక శాఖలో కాంట్రాక్టు ల్యాబ్ టెక్నీషియన్లుగా పనిచేస్తున్న వారి సర్వీసులను మరో ఏడాది పాటు పొడిగించింది. 157 మంది ల్యాబ్ టెక్నీషియన్ల సేవలను మరో ఏడాది పాటు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు.