Kurnool Airport Funds Released: ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఎయిర్పోర్ట్లపై ఫోకస్ పెట్టింది. పెట్టుబడులు పెట్టేందుకు దేశ, విదేశాల నుంచి పారిశ్రామిక వేత్తలు, కంపెనీల ప్రతినిధులు రాష్ట్రానికి వస్తారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ఉన్న ఎయిర్పోర్ట్లలో అవసరమైన అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం కర్నూలు విమానశ్రయంలో అవసరమైన పనుల చేపట్టేందుకు నిధులు విడుదల చేసింది. అలాగే కర్నూలు నుంచి విజయవాడకు విమాన సర్వీస్ నడపాలని ఏపీ మంత్రి టీజీ భరత్ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడ్ని కోరారు.