రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. పారిశ్రామిక విధానాలు, ప్రోత్సాహాలు, రాయితీలతో కంపెనీలను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే ఏపీకి వచ్చే కంపెనీలలో ఎక్కువ భాగం విశాఖకు వెళ్తున్నాయి. విశాఖపట్నం తర్వాత అనకాపల్లి వైపు కూడా పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. విశాఖకు సమీపంలో ఉండటం, మౌలిక వసతుల కారణంగా అనకాపల్లి జిల్లాలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి. దీంతో స్థానికులకు ఉపాధి దొరుకుతుందని అధికారులు చెప్తున్నారు. అలాగే భూములకు కూడా డిమాండ్ ఏర్పడుతోంది.