ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సీఎం నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకు వచ్చాయి. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఒకేరోజు ఏడు పరిశ్రమలకు సీఎం నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ ఏడు పరిశ్రమలు కుప్పంలో రూ.2,203 కోట్లు పెట్టుబడులు పెడుతున్నాయి. వీటి కోసం ఏపీ ప్రభుత్వం ఇప్పటికే భూములు కూడా కేటాయించింది.