Highways Expansion in AP: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో రోడ్ల అభివృద్ది, విస్తరణ, నూతన రహదారుల నిర్మాణం వంటి అంశాలపై దృష్టి సారించింది. ఈ క్రమంలో అధికారులు రాష్ట్రంలోని నాలుగు కీలక హైవేల విస్తరణకు డీపీఆర్ రెడీ చేసి కేంద్రానికి పంపారు. దీనికి గాను రూ.9490 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. వచ్చే సంవత్సరం మార్చి నాటికి కేంద్రం దీన్ని ఆమోదిస్తుందని.. ఆ తర్వాత భూసేకరణ, టెండర్లకు ఆహ్వానం వంటి పనులు ప్రారంభం అవుతాయని భావిస్తున్నారు.