ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం రోజున పశ్చిమగోదావరి జిల్లా సిద్దాంతంలో పర్యటించారు. రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన సభలో ప్రసంగించిన చంద్రబాబు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖ, రాయలసీమ ప్రాంతాలతో పోలిస్తే గోదావరి జిల్లాలకు పరిశ్రమలు తక్కువగా వస్తున్నాయన్న చంద్రబాబు.. అందుకు కారణాలు వెల్లడించారు. అలాగే ఇక్కడి రైతులు సెంట్ భూమి కూడా ఇచ్చేందుకు అంగీకరించరని అన్నారు చంద్రబాబు. మరి గోదారి జిల్లాలలో భూముల ధరలు అంతలా ఉండటానికి కారణాలు ఏంటా అంటే..