Visakhapatnam To Vizianagaram Memu Train Salur: ఏపీలో ఆ పట్టణానికి రైలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉత్తరాంధ్రలో కొత్త రైలు వస్తుందని చెప్పి, ట్రయల్ రన్ కూడా చేసి ఏడాది దాటినా ఇంకా పట్టాలెక్కలేదు. బొబ్బిలి, సాలూరు ప్రజలు విశాఖ, విజయనగరం వెళ్లడానికి పడుతున్న ఇబ్బందులు అంతా ఇంతా కాదు. రైలు బస్సును కూడా ఆపేయడంతో ప్రయాణికులు తీవ్ర నిరాశలో ఉన్నారు. అసలు ఈ రైలు ఎప్పుడు వస్తుందోనని ఎదురుచూస్తున్నారు.