ఏపీలోని ఆ ప్రాంతానికి కొత్త సమస్య.. వచ్చే అతిథులు కూడా రానంటున్నారు.. అంతటికీ అదే కారణం!

3 months ago 7
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల వరుస ఎన్‌కౌంటర్లు జరిగిన సంగతి తెలిసిందే. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో రెండు రోజుల వ్యవధిలో రెండు ఎన్‌కౌంటర్లు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో హిడ్మా సహా పలువురు మావోయిస్టులు చనిపోయారు. అయితే ఈ ఘటనతో మారేడుమిల్లికి వచ్చే పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. సాధారణంగా నవంబర్ నుంచి ఫిబ్రవరి నెల వరకూ మారేడుమిల్లి ప్రాంతానికి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అయితే ఎన్‌కౌంటర్ల తర్వాత పరిస్థితి మారిపోయిందని పర్యాటకులు తమ ట్రిప్‌లు రద్దు చేసుకుంటున్నారని అక్కడ ఉన్న రిసార్ట్స్ వ్యాపారులు చెప్తున్నారు.
Read Entire Article