ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించడంపై దృష్టి సారించింది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఐటీ కంపెనీలు, భారీ పరిశ్రమల ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. గంగవరం మండలంలో సిల్క్, గార్మెంట్స్ క్లస్టర్, తిరుపతి సమీపంలో పెలికాన్ వ్యాలీ ఐటీ పార్క్, ప్రైవేట్ శాటిలైట్ తయారీ సంస్థలు, శ్రీకాళహస్తిలో కొత్త పారిశ్రామిక పార్క్ వంటివి రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతున్నాయి.