Vande Bharat Train Stop In Kadapa Station: ఆంధ్రప్రదేశ్ లో వందేభారత్ రైళ్ల వేగం పెరిగినా, రాయలసీమకు కనెక్టివిటీ తక్కువగా ఉంది. ముఖ్యంగా కడపలో ఒక్క రైలు కూడా ఆగకపోవడంతో ప్రజలు నిరాశతో ఉన్నారు. గతంలో ట్రయల్ రన్ నడిపినా, ఇప్పటికీ ప్రకటన లేదు. కడప ప్రజలు చెన్నై, హైదరాబాద్ వెళ్లడానికి, తిరుమల దర్శనానికి వెళ్లేవారికి ఈ రైలు ఎంతో అవసరం. సికింద్రాబాద్-తిరుపతి, సికింద్రాబాద్-చెన్నై మార్గాల్లో వందేభారత్ నడపాలని డిమాండ్ వినిపిస్తోంది.