ఏపీలోని ఆ రైల్వేస్టేషన్‌కు మహర్దశ.. కేంద్రం స్పెషల్ ఫోకస్.. రూపురేఖలే మారిపోతాయ్!

10 months ago 12
కేంద్రం సహకారంతో ఏపీలో మౌలిక వసతుల ప్రాజెక్టుల నిర్మాణం జోరందుకుంది. రహదారుల నిర్మాణం, రైల్వే లైన్ల ఏర్పాటుతో పాటుగా అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పలు రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారు. ఈ క్రమంలోనే విజయవాడ డివిజన్ పరిధిలోని రాయనపాడు రైల్వేస్టేషన్‌లో ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి. రూ.12.13 కోట్లతో రాయనపాడు శాటిలైట్ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి పర్యటనకు రానున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో రాయనపాడు రైల్వేస్టేషన్‌లో అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని సమాచారం.
Read Entire Article