కేంద్రం సహకారంతో ఏపీలో మౌలిక వసతుల ప్రాజెక్టుల నిర్మాణం జోరందుకుంది. రహదారుల నిర్మాణం, రైల్వే లైన్ల ఏర్పాటుతో పాటుగా అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పలు రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారు. ఈ క్రమంలోనే విజయవాడ డివిజన్ పరిధిలోని రాయనపాడు రైల్వేస్టేషన్లో ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి. రూ.12.13 కోట్లతో రాయనపాడు శాటిలైట్ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి పర్యటనకు రానున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో రాయనపాడు రైల్వేస్టేషన్లో అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని సమాచారం.