ఏపీ సీఎం చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గనుల శాఖపై చంద్రబాబు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మైనింగ్ లీజుల కేటాయింపులో వడ్డెర్లకు 15 శాతం కేటాయించేలా విధానం సిద్ధం చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఈ అంశం గురించి చర్చించేలా ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వెనుకబడిన వర్గాలైన వడ్డెర్లకు ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చేలా విధానం ఉండాలని సూచించారు.