Vizag Durg Vande Bharat Stop In Parvathipuram: విశాఖపట్నం-దుర్గ్ (ఛత్తీస్గఢ్) మధ్య మరో వందే భారత్ రైలు సేవలు ప్రారంభంకానున్నాయి. రాయ్పూర్, మహాసముంద్, ఖరియార్ రోడ్, కాంతబంజి, తిత్లాగఢ్, కేసింగా, రాయగడ, విజయనగరం మీదుగా విశాఖపట్నం చేరుకుంటుంది. పీలో తక్కువ స్టేషన్లలో ఆగేలా మార్గం ఖరారు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీలోని మరో స్టాప్లో ఆ రైలు ఆగేలా స్థానిక ఎమ్మెల్యే రిక్వెస్ట్ చేయగా.. రైల్వే సహాయక మంత్రి సానుకూలంగా స్పందించారు.