Financial Assistance To Auto Drivers in AP: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభించనుంది. అయితే అదే రోజున ఆటోడ్రైవర్లకు కూడా ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈ విషయాన్ని వెల్లడించారు. ఐదు రకాల బస్సులలో రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని.. అలాగే ఆటోడ్రైవర్లకు కూడా అదే్రోజు ఆర్థిక సాయం అందిస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు.