AP Weather Today: ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మరోవైపు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి.. ఓ వైపు వర్షాలు, మరోవైపు ఎండలతో విభిన్న వాతావరణం ఉంటుందంటున్నారు. కర్నూలు జిల్లాలో కురిసిన వర్షానికి కోతకు సిద్ధంగా ఉన్న పంటలు నీట మునిగాయి. తెలంగాణలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.