AP Government Give 10 Percents bars to Kallu Geetha Karmikulu: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 1 నుంచి నూతన బార్ పాలసీ అమలు చేయనుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న బార్ పాలసీ గడువు ఆగస్ట్ 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల ఒకటో తేదీ నుంచి కొత్త బార్ పాలసీ అమలు చేయనున్నారు. మరోవైపు కొత్త బార్ పాలసీలో భాగంగా కల్లుగీత కార్మికులకు 10 శాతం కోటా కేటాయించాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.