గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి తీపికబురు వినిపించారు. ఏపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రక్రియలో కొంతమంది ఉద్యోగులను తొలగించవచ్చనే ప్రచారం జరగ్గా.. మంత్రి వాటిని ఖండించారు. ఎవరినీ ఉద్యోగాల నుంచి తొలగించడం లేదని.. అలాంటి వదంతులను నమ్మవద్దని ఉద్యోగ సంఘాలతో జరిగిన సమావేశంలో ఉద్యోగులకు మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి క్లారిటీ ఇచ్చారు.