Andhra Pradesh Temples E Pos Machine: ఆంధ్రప్రదేశ్లోని ఆలయాల్లో ఇక క్యూలైన్ల తిప్పలుండవు. దేవాదాయశాఖ కొత్తగా ఈ-పోస్ యంత్రాలు, వాట్సాప్ సేవలు అందుబాటులోకి తెస్తోంది. దర్శనం, లడ్డూ, సేవలు, పార్కింగ్ టికెట్లు ఇక క్షణాల్లోనే పొందొచ్చు. ఆలయాల నిర్వహణలో పారదర్శకత పెంచేందుకు ప్రత్యేక డ్యాష్బోర్డ్ కూడా సిద్ధమైంది. భక్తులకు సౌకర్యంతో పాటు, ఆలయాల నిర్వహణలోనూ విప్లవాత్మక మార్పులు రానున్నాయి. ఇప్పటికే కియోస్క్ మెషిన్లను ఆలయాల్లో ప్రారంభించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.