Andhra Pradesh Liquor Shops: ఆంధ్రప్రదేశ్ లోని మందుబాబులకు ప్రభుత్వం త్వరలో శుభవార్త అందించనుంది. రాష్ట్ర ఖజానా ఆదాయం పెంచేందుకు ఎక్సైజ్ శాఖ పర్మిట్ రూమ్ల ఏర్పాటుపై దృష్టి సారించింది. గతంలో రద్దు చేసిన ఈ విధానాన్ని తిరిగి తీసుకురావడం ద్వారా సుమారు రూ.200 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ.7.5 లక్షలు, ఇతర ప్రాంతాల్లో రూ.5 లక్షలుగా ఫీజు నిర్ణయించనున్నారు. దీనివల్ల బహిరంగంగా మద్యం సేవించడం తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.