మహిళల కోసం ఏపీ ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది దీపావళి సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు దీపం -2 పథకం ప్రారంభించారు. ఈ పథకం కింద ప్రతి నాలుగు నెలలకు ఓసారి చొప్పున ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తారు. తొలుత గ్యాస్ బుక్ చేసుకుని డబ్బులు చెల్లిస్తే.. గ్యాస్ డెలివరీ అయిన ఒకట్రెండు రోజుల్లో బ్యాంకు ఖాతాల్లో రాయితీ సొమ్ము జమ చేస్తున్నారు. అయితే తొలి సిలిండర్ పొందేందుకు ఉన్న గడువు మార్చి 31తో ముగియనుంది.