రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు ఓ బ్యాడ్ న్యూస్.. జులై నెలలో కూడా కందిపప్పు సరఫరా లేనట్లు తెలిసింది. మార్చి నెల నుంచి ఏపీలో రేషన్ కార్డుదారులకు కందిపప్పు సరఫరా ఆగిపోయింది. అయితే జులై నెలలో అయినా కందిపప్పు సరఫరా ఉంటుందని రేషన్ కార్డుదారులుు ఆశించారు. అయితే జులై నెలలో కూడా రేషన్ కార్డుదారులకు కందిపప్పు సరఫరా లేనట్లు సమాచారం. మరోవైపు వృద్ధులు, దివ్యాంగులకు ఇప్పటికే ఇంటి వద్దనే రేషన్ సరుకుల డెలివరీ జరుగుతోంది.