ఏపీలోని రైతులకు ముఖ్య గమనిక. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరణను ప్రారంభించనుంది. అక్టోబర్ 27 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం సేకరణను ప్రారంభించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈ ఖరీఫ్ సీజన్లో 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు నాదెండ్ల మనోహర్ వివరించారు. రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధుల సమావేశానికి హాజరైన మంత్రి నాదెండ్ల మనోహర్.. వారి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.