ఏపీలోని రైతులకు శుభవార్త. సాధారణంగా బ్యాంకులలో వ్యవసాయ రుణాలు పొందాలంటే పట్టాదారు పాసు పుస్తకాలు అవసరం అవుతూ ఉంటాయి. అయితే ఇకపై పట్టాదారు పాస్ పుస్తకాలు లేకుండానే రుణాలు పొందవచ్చు. ఈ విషయాన్ని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. బ్యాంకర్లకు లైవ్ వెబ్ల్యాండ్ లోన్ చార్ట్ మాడ్యూల్ అందుబాటులో ఉంటుందన్న మంత్రి సత్య ప్రసాద్.. దీని ఆధారంగా పాసు పుస్తకాలతో పని లేకుండానే లోన్లు పొందవచ్చని వివరించారు.