Pakistani Citizens Leave Andhra Pradesh: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలోని పాక్ జాతీయులను గుర్తించి వెనక్కి పంపాలని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో ఉన్న పాకిస్థానీయులు వెంటనే దేశం విడిచి వెళ్లాలని డీజీపీ హరీష్కుమార్ గుప్తా హెచ్చరించారు. వైద్య వీసాలపై వచ్చిన వారికి గడువు ఇచ్చారు. ఈ చర్యలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. ఏం జరగబోతుందో వేచి చూడాలి.